పినపాక మండలం వెంకట్రావు పేట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సబ్ స్టేషన్ కొరకు , పినపాక రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం, తాసిల్దార్ విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో వెంకట్రావు పేట గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 2 లోని ఒక ఎకరం ప్రభుత్వభూమిని కేటాయించినట్లు గిర్థవార్ -2 వీరభద్రం తెలిపారు. సంబంధిత భూ కేటాయింపు పత్రాలను మండల విద్యుత్ శాఖ ఏఈ రవీంద్రనాథ్ కు అందజేశారు.
Post A Comment: