మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మద్దికొండ గ్రామంలో, పోలీస్ కానిస్టేబుల్ తాటి నాగార్జున ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ ఆటల పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన 2014 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ తరపున అశ్వరావుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి జారే ఆదినారాయణ క్రీడాకారులను పరిచయం చేసుకొని, కమిటీ టీముకు డ్రస్ అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను మంచిగా ఆటలు ఆడే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. క్రీడల్లో పాల్గొన్న యువకులకు ఆటలతోపాటు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, మద్ది కొండ గ్రామ యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: