చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: అకాల వర్షానికి మండల వ్యాప్తంగా మిరపతోటలు తీవ్రంగా నష్టం వాటిల్లింది.ప్రధానంగా తిప్పనపల్లి,గానుగపాడు, గుర్రంగూడెం, పోకలగూడెం, తుంగారం గ్రామాలలోని మిరపతోటలు వానతాకిడికి నెలకొరిగాయి. తోటలల్లో మోకాళ్ళలలోతు నీరు నిలవడంతో పంటకు నష్టం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోకలగూడెం గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న మిరపతోటలను టీఆర్ఎస్ గ్రామశాఖ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్, సూర్య, వెంకటరత్నం, రాంబాబు, హనమాలు పరిశీలించారు.
Post A Comment: