CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూలూరుపాడును వదలని కోతుల బెడద.కోతులను పట్టించాలని బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కు వినతి పత్రం.

Share it:



మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రము లో కోతుల బెడద ఎక్కువయిందంటూ వెంటనే కోతులను పట్టించాలని స్థానిక ఎంపీడీవో చంద్రశేఖర్ కు బిఎస్పీ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు దేవరకొండ నిర్మల మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల కేంద్రంలో గత కొంత కాలంగా కోతుల బెడద ఎక్కువై వ్యాపారులు, మహిళలు, పిల్లలు, విద్యార్థులు, ప్రయాణికులు

అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనేక సందర్భాలలో కోతుల వలన చాలా మంది గాయపడ్డారని తెలిపారు. కాబట్టి మండల అధికారులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా ఈ కోతుల బెడద ను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి పార్టీ మండల మహిళ ఉపాధ్యక్షురాలు కొంగల లలిత, కార్యదర్శి దొంగల వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: