CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ మహిళలను వివస్త్రను చేసిన ఫారెస్ట్ బీట్ గార్డ్ మహేష్ ను సస్పెండ్ చేయ్యాలి.సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్.

Share it:

 



  •  జూలూరుపాడు మండలం కేంద్రం లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన

    

మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం లోని సాకివలస ఆదివాసి గ్రామానికి చెందిన ముగ్గురు ఆదివాసి మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డ్ మహేష్ అమానుషంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జూలూరుపాడు మండలం కేంద్రం లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం నల్లజెండాల తో నిరసన వ్యక్తం చేయటం జరిగింది. ఈ సందర్భంగా

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జూలూరుపాడు మండల కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ..

మహిళలను వివస్త్ర ను చేయడం ఫారెస్ట్ బీట్ గార్డ్ అమానుషానికి పరాకాష్టని అన్నారు. సాకివలస కు చెందిన 50 ఎండ్ల వెట్టి లక్ష్మి,18 ఎండ్ల సొడే దేవమ్మ,16 సంవత్సరాల సోడే రజనీ పోయిలో కట్టెల కోసం అడవికి వెళ్లారు. వీరిని చూసిన ఫారెస్ట్ గార్డ్ మహేష్ విచక్షణ మరచి ప్రవర్తించాడని, లక్ష్మి, రజనీ లను విపరీతంగా కొట్టాడని, దేవమ్మ ను 

తరమగా గుంటలో పడిందని, అయినా వదిలి పెట్టకుండా ఆమె లంగా పట్టుకొని గుంజాడని, దీనితో ఆమె వివస్త్ర రాలు అయ్యిందని,ఈ ఘటన ఫారెస్ట్ వారి దౌర్జన్యాలకు పరాకాష్టని, పోయిలోకి కట్టెలు తెచ్చుకోవడం కూడా నేరమా..! అని అడవిని మేస్తున్న బడా కంపెనీలను, బడా బాబులను కాపాడుతూ.. నోరు లేని ఆదివాసుల మీద ఇంత దాస్టికం సరికాదని,

ఫారెస్ట్ బీట్ గార్డ్ మహేష్ ను వెంటనే సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పై సమగ్ర విచారణ జరపాలని అన్నారు.

గాయపడ్డ మహిళకు వైద్యం అందించాలని కోరారు.

సభ్య సమాజం ఫారెస్ట్ వారి అమానుషాన్ని ఖండించాలని గోపాలరావు కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి, ఎస్ డి ఎల్ సి కార్యదర్శి గోపాలరావు, ఏ ఐ కె ఎమ్ ఎస్ మండల కార్యదర్సి వల్లోజి రమేష్, పీ వై ఎల్ జిల్లా నాయకులు రాయల సిద్దు, కల్తి సురేష్, పీవోడబ్ల్యూ మండల నాయకులు కల్తి సుగుణ, సోలం సుజాత,పూనెం వసంత, పూనెం నర్సింహ్మరావు, లింగాల రాములు, కల్తి పవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: