మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మున్నూరు కాపు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అపెక్స్ కమిటీ చైర్మన్, గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రీ రవి) జన్మదిన వేడుకలు జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామంలో జూలూరుపాడు మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం, కరివారిగూడెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో రవిచంద్ర పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ కూడలిలో కేక్ కట్ చేసి గ్రామస్తులు అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం మాజీ జిల్లా కార్యదర్శి తాటికొండ కృష్ణ రావు మాట్లాడుతూ.. గాయత్రి రవి, కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ సేవా తత్పరతను చాటుకుంటున్నారని అన్నారు. ఒక పక్క వ్యాపార రంగాల్లో రాణిస్తూ మరో పక్క రాజకీయాలలో ఉంటూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి గొప్ప మనసు చాటుకుంటున్నారని అన్నారు. కరోనా కాలంలో పేద ప్రజలకు వివిధ రూపాలలో సేవలు అందించిన ఘనత ఒక్క రవిచంద్రకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలం మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు రోకటి సురేష్, ట్రెజరర్ బాపట్ల మురళి, మండల సంక్షేమ సంఘ నాయకులు రామిశెట్టి రాంబాబు, చౌడం నరసింహారావు, శిరంశెట్టి రామారావు, మల్లెల నాగేశ్వరరావు,
పాలెపు భద్రయ్య, రామిశెట్టి నాగేశ్వరరావు, ముత్యాల మాణిక్యమ్మ, వడ్డే వెంకటేశ్వర్లు, వడ్డే వెంకటనారాయణ, తోట శ్రీను, వడ్డే సత్యనారాయణ, తాటికొండ చలపతి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: