మన్యం టీవి న్యూస్,మణుగూరు:
అశ్వాపురం మండలం చింత్రియాల కాలనీలో పినపాక నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దళితుల పట్ల ఎంతో అంకితభావంతో దళిత బందు ప్రవేశపెట్టి ప్రతి నియోజకవర్గంలో వందమందికి ఇవ్వాలని నిధులు విడుదల చేస్తూ జీవో ప్రకటన చేయటం పట్ల దళితుల పక్షాన సంతోషం వ్యక్తం చేయడం జరిగింది .దేశంలో ఎంతో గొప్ప పథకం గా అభివర్ణిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆయా రాష్ట్రాల్లో పెన్షన్లు , మిషన్ భగీరథ పథకం, షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు లేవు ఇలాంటి గొప్ప పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ అభివృద్ధి పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సందర్భంగా దళితులకు ఇంత మంచి పథకాన్ని పెట్టినందుకు దళితులందరూ టిఆర్ఎస్ పార్టీ వెంట ఉండి మరొకసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి పినపాక నియోజకవర్గం లో ఆదివాసి ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని భారీ మెజారిటీతో గెలిపించ డానికి దళితులందరూ ఆయన వెంట నడవడానికి పోటీ పడుతున్నారని తెలియజేశారు.
Post A Comment: