ములకలపల్లి:మన్యం మనుగడ (న్యూస్):
ములకలపల్లి లోని రాచన్నగూడెం గ్రామ పంచాయితీ పరిధిలోని గిరిజన ఆదివాసీ మహిళలను జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లడుతూ బాధితుల తరుపున వారికి న్యాయం జరిగేంత వరకు జనసేనపార్టీ పోరాటం చేస్తదని,ఫారెస్ట్ అధికారుల కీచక చర్యను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని,ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,గిరిజనులకు జరిగినటువంటి ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టడానికి అధికారలు జాప్యం చేస్తున్నారని,భవిష్యత్తులో ప్రభుత్వం ఫారెస్ట్ అధికారిపై చటపరమైన చర్యలు తీసుకోకపోతే బాధితుల పక్షాన ఉమ్మడి జనసేన పార్టీ కార్యకర్తలు,నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడతామని,ప్రభుత్వం దిగివచ్చేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం జిల్లా సెక్రటరీ గరికే రాంబాబు,అన్నపురెడ్డిపల్లి జంసేనపార్టీ మండల నాయకులు తలారి రాజు,జనసేన మండల నాయకులు తాటికొండ ప్రవీణ్ కుమార్,పొడిచేటి చెన్నారావు,వినీత్,సుధాకర్,వీరభద్రం,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: