మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా మణుగూరు పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం యువజన నాయకులు బోశెట్టి రవి ప్రసాద్ ను పార్టీ ఏకగ్రీవంగా నియమిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు.ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బోశెట్టి.రవి ప్రసాద్ మాట్లాడుతూ తన పై నమ్మకం ఉంచి పినపాక నియోజకవర్గ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించిన విప్ రేగా కాంతారావు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ విధి విధానాలను అనుసరిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
Post A Comment: