గుండాల జనవరి 15 (మన్యం మనుగడ) పి డి ఎస్ యు వ్యవస్థాపకులు జార్జి రెడ్డి బాటలో నడుస్తా మని పి డి ఎస్ యు జిల్లా నాయకులు ఏర్ప రాజేష్ అన్నారు. శనివారం జార్జి రెడ్డి 75వ జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఎన్నో ఉద్యమాలను జార్జి రెడ్డి చేశారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి విద్యార్థి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు యసారపు తరుణ్, రాకేష్ , గడ్డం సుమంత్ , ఎస్కె షరీఫ్, ఈసం దిలీప్, ఈ సం రామకృష్ణ , మోకాళ్ళ మధు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: