గుండాల జనవరి 4 (మన్యం మనుగడ) విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు హాజరుకావాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి కోరారు. మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలలో చేరిన వారి సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కళాశాలకు వచ్చే వారు మాత్రం చాలా తక్కువ శాతం ఉన్నారన్నారు. ప్రతి విద్యార్థి తప్పకుండా కళాశాలకు రావాలని రాని ఎడల కళాశాలలో తరగతులు వినకపోవడం వలన ఉత్తీర్ణత శాతం తగ్గుతుందన్నారు. ప్రతి విద్యార్థి కళాశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి రామక్క, గుండాల ఎంపీటీసీ సంధాని, సాయన్న పల్లి ఎంపీటీసీ కృష్ణారావు, ఉప సర్పంచ్ ఉపేందర్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు
Post A Comment: