CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామ గ్రామాన రైతు బంధు వారోత్సవాలు:జడ్పీటీసీ పొశం.నర్సింహారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని,రైతు కుటుంబాలకు రైతుబంధు ఇచ్చి అండగా నిలిచిన,రైతు బంధావుడు సీఎం కేసీఆర్ అని, మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు అన్నారు. సోమవారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మొదటి విడత రైతులకు రైతుబంధు విడుదల చేసిన సందర్భంగా,రైతు బంధు సాయం రూ.50 వేల కోట్ల రూపాయలకు చేరుకున్న సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు జనవరి 1న నుంచి జనవరి 10 వరకు ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.ఈ వారోత్సవాల సందర్భంగా ముగ్గుల పోటీలు, వ్యాసరచన పోటీలు,రైతు బంధు కు సంబందించిన 7 చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.ఈ పోటీలను అన్ని గ్రామపంచాయతీ సర్పంచ్లు, మండలాల అధ్యక్షులు, నాయకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ నెల 10వ తేదీన ప్రతి గ్రామం నుంచి నాయకులందరు రైతువేదికలలో హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,మండల అధ్యక్షుడు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,ఎంపీటీసీలు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక. ప్రసాద్,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు ప్రభుదాస్, కార్యదర్శి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పార్టీ అధికార ప్రతినిధి మేకల రవి,ముద్దంగుల కృష్ణ, రామారావు,నాగేశ్వరరావు,ఆవుల నర్సింహారావు,తాత రమణ,మహిళ నాయకురాలు, రమాదేవి,చంద్రకళ,మాధవి,రమ,మున్ని,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: