మన్యం టీవీ, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలోగల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, మీడియా మిత్రులు సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ పౌండేషన్ అధ్యక్షురాలు మరియు అశ్వరావుపేట ఎంపీటీసీ వేముల భారతి తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ పత్రిక యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యం ప్రజల మనుగడ కోసం, సంస్కృతి సాంప్రదాయాలు వెలికితీసి అభివృద్ధి పథంలో నడపడానికి స్వయంగా పత్రిక రావడం శుభపరిణామం అని, ఈ పత్రిక మన్యం ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తూ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోకల హారీస్ గుప్తా, గౌరవ అధ్యక్షులు కలపాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కురిశెట్టి నాగబాబు, గౌరవ సలహాదారులు షేక్ వలి ఫాషా మరియు ఉదయ్ రాఘవేంద్ర, లక్కిరెడ్డి కృష్ణా రెడ్డి, జక్కుల రాంబాబు, బండి సత్యనారాయణ మరియు మీడియా మిత్రులు పలువురు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: