మన్యం మనుగడ, పినపాక :
నూతన సంవత్సరం సందర్భంగా చిన్నారులకు స్టడీ మెటీరియల్ ను ఎస్బిఐ ఉద్యోగి గీతా మోహన్ రావు అందజేశారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన ఎస్బిఐ ఉద్యోగి గీద మోహన్ రావు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిరుపేద చిన్నారుల విద్య కు ఉపయుక్తమైన మెటీరియల్ అందజేశారు. మోహన్ రావు గతంలో ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు. పాఠశాల కు వెళ్లకుండా పనిచేసే విద్యార్థులను ప్రోత్సహించి మరలా పాఠశాలకు వెళ్లే విధంగా గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది.
Post A Comment: