CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రొత్త సంవత్సరం లో కంటి వెలుగులు నింపిన ప్రభుత్వ విప్ రేగా.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్,ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా. కాంతారావు గత డిసెంబర్ 29న పెద్ద ఎత్తున మణుగూరు 100 పడకల హాస్పిటల్ నందు కంటి పరిక్షలు నిర్వహించడం జరిగింది.కంటి పరిక్షల అనంతరం హైద్రాబాద్ వెళ్లి, ఆపరేషన్ చెపించుకున్న మణుగూరు మండలం కూనవరం నివాసి అయినా వల్లభనేని.నాగమ్మను విప్ రేగా.కాంతారావు ఆదేశాల మేరకు ఆదివారం ఎంపీటీసీల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనిక. ప్రసాద్ లు వెళ్లి,పరమర్శించి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వల్లభనేని. నాగమ్మ మాట్లాతు చీకట్లో వెలుగులు నింపినట్టు,మా అందరికి కంటి వెలుగును నింపి క్రొత్త సంవత్సరం లో కంటి చూపుతో వచ్చిన మాకు స్వాగతం పలికి,ఇంటికి పెద్ద కొడుకు లాగ ఉన్నాడని, మణుగూరు నుండి హైదరాబాద్ తీసుకువెళ్లి, ఆపరేషన్ చేయించుకొని, ఎక్కడ యిబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించారు అని,మణుగూరు క్యాంపు కార్యాలయం నకు తీసుకొని వచ్చి,ఇక్కడ అందరికి భోజనాలు పెట్టించి, వారి వారి కుటుంబ సభ్యులు కు సమాచారం తెలిపి వచ్చి తీసుకెళ్లామని చెప్పారని,విప్ రేగా కాంతారావు కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కూనవరం పంచాయతీ శాఖ అధ్యక్షులు పిన్నాక.వెంకట్రావు, బి.సి సంఘం నాయకులు బత్తుల.నాగేశ్వరావు,పంచాయతీ కోప్షన్ సభ్యులు అంచ. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: