గుండాల జనవరి17(మన్యం మనుగడ) మండలం పరిధిలోని పోతి రెడ్డి గూడెం గ్రామం లో ఆశా వర్కర్ ను నియమించాలని గుండాల ఎంపీటీసీ ఎస్.కె సంధాని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఆశా వర్కర్ లేనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గతంలో జిల్లా వైద్యాధికారి కి విజ్ఞప్తి చేసిన ఆయన స్పందించలేదన్నారు. కరోనా నేపథ్యంలో గ్రామంలోఆశా వర్కర్ ను నియమించే విధంగా అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు
Post A Comment: