గుండాల జనవరి 17 (మన్యం మనుగడ) గుండాల మండలం లో ఆర్యవైశ్య సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి చారు గుండ్ల శ్రీనివాస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు ఇంటి వద్ద మండలాల్లో ఉన్న ఆర్యవైశ్యుల తో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. తాను ఎప్పుడు ఆర్యవైశ్యులకు అందుబాటులో ఉండి పని చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు, ఉపేందర్, నాగరాజు, గౌరిశెట్టి సత్యనారాయణ, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: