మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోగల గ్రామాలకు గ్రామ పంచాయతీ స్థాయి వాలీబాల్ క్రికెట్ క్రీడలను ప్రారంభించిన కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ స్థానిక సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని 13 14 15 తేదీలలో క్రికెట్ మరియు వాలీబాల్ క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే యువత క్రీడా స్ఫూర్తితో పాటు మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలని క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ మంచి ప్రతిభను సూపాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు అజ్మీరా భాస్కర్, భూక్య అర్జున్ ,భూక్య రామదాస్ ,పోలెబోయిన కమలాకర్, పూనెం విష్ణుమూర్తి, భూక్య సోమేష్ కుమార్ ,తొలెం శ్రీను ,క్రీడాకారులు పాల్గొన్నారు.
Post A Comment: