మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంను పండుగమాదిరి చేసి,రైతు ముఖంలో చిరునవ్వు చిందిస్తుంటే,బిజెపి ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు చేస్తూ, రైతులను దివాలా తీసేందుకు, నిర్ణయాలు తీసుకుంటూ,రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. గురువారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,బిజెపి ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.ఏకపక్ష నిర్ణయాలతో బిజెపి ప్రభుత్వం ఇష్టానుసారంగా ఎరువుల ధరలను పెంచి,రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు అని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్,ఆదేశాల మేరకు ఉద్యమిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పిటిసి పోశం. నరసింహారావు,టిఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు ఆడపా అప్పారావు,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వట్టం రాంబాబు,తడకమళ్ళ ప్రభుదాసు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: