CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అసత్య ప్రచారాలు మానుకోవాలి జడ్పీటీసీ పొశం.నర్సింహారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని కొందరు వ్యక్తులు తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని,మణుగూరు మండల జెడ్పీటీసీ పోశం నరసింహారావు తెలిపారు. గురువారం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కారం. విజయ కుమారి ఏర్పాటు చేసిన మీడియా ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,బుధవారం రాత్రి తన కారు,బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే.అయితే బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మండలంలోని ముత్యాలమ్మనగర్ లో జరిగిన ముగ్గుల పోటీల పైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వెళుతున్నామని,ఈ క్రమంలో అనుకోకుండా యాక్సిడెంట్ సంఘటన జరిగిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యక్తులు నాపై మద్యం తాగి,డ్రైవింగ్ చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు అని, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అన్నారు.దీని వల్ల నా కారులో ఉన్న ఎంపీపీ కారం విజయకుమారి,సర్పంచ్ బచ్చల భారతి,నాది ఇమేజ్ డ్యామేజి అయ్యిందని, తనపైనా,ఇతర ప్రజా ప్రతినిధుల పైనా దుష్ప్రచారం చేసిన వ్యక్తులపై త్వరలో పరువునష్టం దావా వేస్తానని, తనపై ప్రజా ప్రతినిధులపై చేసిన దుష్ప్రచారం ఆవేదనకు గురిచేసిందని జడ్పీటీసీ పొశం. నర్సింహారావు తెలిపారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి, మండల అధ్యక్షుడు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు,కో-ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, కునవరం సర్పంచ్ ఏనిక. ప్రసాద్,ఉపసర్పంచ్ ప్రభుదాస్,టి ఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మేకల.రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: