CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డబల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి ప్రవేశించిన గిరిజనేతరులు.

Share it:


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : మండల కేంద్రంలో రూ.2కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి మంగళవారం గిరిజనేతరులు ప్రవేశించారు. విషయం తెలుసుకున్న తహసిల్దార్ ఉషశారద గిరిజనేతరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇండ్లలోకి ప్రవేశిస్తే చట్టరీత్యా నేరంమవుతుందని వెంటనే ఖాళీ చేయాలని కోరగా వారు అందుకు నిరాకరించారు. తాము నిరుపేదలమని మాకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలన్నారు. అక్కడికి వచ్చిన జడ్పిటిసి కొణకొండ్ల వెంకటరెడ్డి విషయాన్ని గిరిజనేతరులు చెప్పగా వారికి మద్దతుగా మాట్లాడారు.ఏజెన్సీ చట్టాలను అడ్డుపెట్టుకొని ముస్లిం,మైనార్టీ దళితులు, బీసీలకు ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల అన్యాయం జరుగుతుందన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల తెలియజేసి పేదలకు ఇళ్ల మంజూరు విషయాన్ని తెలియజేస్తామని హామీ ఇచ్చి వారిని పోలీసుల సహకారంతో అక్కడ నుండి తాసిల్దార్ ఉషశారద,ఎస్ఐ బి రాజేష్ కుమార్ పంపించారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు తాళాలు వేసి తాత్కాలికంగా సమస్యను అధికారులు పరిష్కరించారు.

Share it:

TS

Post A Comment: