మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురం లో తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు అధ్యక్షత న కమలాపురం రైతులు మొదటి విడత రైతు బంధు,రైతుల అకౌంట్ లలో జమ ఐన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ,సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నిర్వహించారు.ఈ సందర్భంగా అడపా. అప్పారావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని,రైతు సంక్షేమమే ద్యేయం గా సీఎం కేసీఆర్ అనేక పధకాలను ప్రవేశపెట్టి,అమలు చేస్తున్నారు అని తెలిపారు. రైతు బంధు,రైతు భీమా లాంటి పథకాలు దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.24 గంటలు ఉచిత కరెంట్,పవర్ ప్లాంట్లు, సాగు నీటి ప్రాజెక్టు లు నిర్మాణం చేసి రైతాంగానికి అండగా నిలిచారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,రైతు బంధు సమితి అధ్యక్షులు దొబ్బల. వెంకటప్పయ్య,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,హర్ష నాయుడు, టిఆర్ఎస్ నాయకులు వట్టం. రాంబాబు,వెంకట్ రెడ్డి, శ్రీనివాస్,కె.అప్పారావు,తాత రమణ,వేముల.లక్ష్మయ్య, యువజన నాయకులు బోశెట్టి.రవి ప్రసాద్,గుర్రం. సృజన్,రైతులు కత్తి రాము, హరి గోపాల్,రాంబాబు, ఉడతాని.రవి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: