గుండాల జనవరి 10 (మన్యం మనుగడ) మండలంలోని పోడు రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేసిన న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునురి మధు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం. మండలంలో పెద్ద మొత్తంలో పోడు రైతుదారులు ఉన్నందున సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. దీనితోపాటు మండలం పరిధిలోని మటంలంక గ్రామానికి రహదారితో పాటు రెండు వాగుల పై వంతెనలను కట్టలి అని వినతిపత్రంలో కోరారు. గుండాల నుండి రంగాపురం రహదారికి అటవీశాఖ అనుమతులు కూడా మంజూరు అయ్యేవిధంగా చొరవ చూపాలన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల సారయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: