CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ క్రీడలను ప్రారంభించిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్.

Share it:

 



మన్యం టీవీ కరకగూడెం : మండల పరిధిలోని తాటిగూడెం ఆదివాసీ యువ సేన ఆధ్వర్యంలో 2 జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల స్ధాయి వాలీబాల్ క్రీడలనూ స్థానిక ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ , స్థానిక సర్పంచ్ కొమరం విశ్వనాధం తో పాటు రఘునాథ పాలెం సర్పంచ్ పోలెబోయిన నరసింహారావు, గ్రామ పెద్దలు, ఆదివాసీ నాయకులు , యువత తో కలిసి ప్రారంభించారు . 

ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పర్వదినాలను పురస్కరించుకొని 11వ సారి, ఈ నెల 12,13,14 తేదిలలో వాలీబాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. యువకుల అందరూ చక్కని క్రీడా స్పూర్తితో నిర్వాహకులకు సహకరించి విజయవంతం అవ్వడానికి సహకరించాలని కరకగూడెం మండలానికి ముఖ్యంగా తాటిగూడెం గ్రామానికి క్రీడలలో మరియు అధికారులకు సహకరించడం లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వున్నదని క్రీడాకారులు అందరూ.మంచి ప్రతిభ కనబరిచి, మెళుకువలు నేర్చుకొని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని అన్నారు . క్రీడల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు, క్రీడలలో పాల్గొనే జట్లు నిర్ణీత సమయానికి హాజరై క్రీడలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించాలని ఆదివాసీ యువ సేన ప్రతినిధులు కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పోలెబోయిన బాబు, రామారావు, కొమరం సత్యం, ముత్తయ్య, నారాయణ , తాతారావు, చందా హరికృష్ణ, తదితరులతో పాటు, ఆదివాసీ యువ సేన నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: