మన్యం మనుగడ,ములకలపల్లి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాసన్న పేట పంచాయితీ సాకి వాగు గ్రామ వలస ఆదివాసీ గిరిజన మహిళలపై ఫారెస్ట్ బీట్ అధికారి మహేష్ చేసిన దాడిని ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి తీవ్రంగా ఖండించారు. ఆదివాసీ గిరిజనుల జోలికొస్తే సహించేది లేదని,ఫారెస్ట్ బీట్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని సున్నం నాగమణి డిమాండ్ చేశారు.గిరిజన మహిళలు వెట్టి లక్ష్మి ,సోడే దేవమ్మ,సో డే మూడమ్మ ,సోడే రజనీలు కట్టెల కోసం వెళ్లగా మహిళలను చూడకుండా కొట్టి మహిళలను వివస్త్రలను చేసి గాయపరిచిన ఫారెస్ట్ బీట్ అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ సున్నం నాగమణి డిమాండ్ చేశారు.లేనియెడల ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Post A Comment: