మన్యం టీవీ కరలగూడెం:కరకగూడెం మండల పరిధిలోని చొప్పాల గ్రామం ముసలమ్మ తల్లి గుడి ప్రాంగణంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పీఠం ,జ్ఞానదా పౌండేషన్ ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, పేదలకు,వస్త్రాలు అక్షరాస్యత కార్యక్రమం జ్ఞానదా పౌండేషన్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ శర్మ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ.గ్రామ పెద్దల సమన్వయంతో ఉమ్మడి సమత్ మోతె గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రజల ప్రాంతాల వారి స్థితిగతులు,ప్రత్యేకత,వారిదైన సొంత గుర్తింపు(భాష,ఆచార వ్యవహారాలు,సాంస్కృతికత)ను పరిరక్షించి,సామాజిక బాధ్యత తో స్పష్టత కలిగిండాలని ఆయన తెలిపారు.
అనంతరం ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ శిబరాన్ని వినియెగించుకున్న రోగులకు,వృద్దులకు వస్త్రాలు అందజేసి,చిన్నారులకు చిత్రీలేఖన కార్యక్రమలు నిర్వహించారు.
అనంతరం స్థానిక సర్పంచు జవ్వాజి రాధ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య శిబిరం,వస్త్రాలు పంపిణీ,చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం అభినీయం అన్నారు.
ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించందుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు జవ్వాజి రాధ,కరకగూడెం జెడ్పీటీసీ కొమరం కాంతారావు,ఎంపీటీసీ కొమరం మునేంద్ర-సురేష్,సమత్ మోతె సర్పంచు ఇర్ప విజయ్ కుమార్,ఉప సర్పంచు బోడ ప్రశాంత్,చేను సాంబయ్య,ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ ,రమేష్,అంజయ్య ,గ్రామ పెద్దలు తోలెం వీరస్వామి,తోలెం నర్సయ్య,ఎట్టి నర్సయ్య,ఏడూళ్ల సమ్మయ్య,అయ్యెరు ఆదినారాయణ,జిగట నరసింహారావు,తెల్లం వెంకటేశ్వర్లు,తాటి స్వామి,యూత్ కమిటీ:రాం కుమార్,వెంకట్,రమేష్,నరేష్,ప్రకాష్,కళ్యాణ్,మేఘనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: