- వ్యవసాయం దశ,దిశ మార్చిన మహాత్ముడు సీఎం కేసిఆర్:పీ ఏ సీ ఎస్ చైర్మన్ ముదునూరి రవి శేఖర్ వర్మ
మన్యం మనుగడ,పినపాక:
పంట కు పెట్టుబడి సాయం అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని, దండగ అన్న వ్యవసాయాన్ని రైతు బంధు పథకం పండుగ చేసిందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ అన్నారు. ఆదివారం పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోగల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతుబంధు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ గుమ్మడి గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రవి శేఖర్ వర్మ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం కర్షకులకు, వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించిందని, అప్పుల ఊబి నుంచి గట్టెక్కిచ్చి, సాగుకు భరోసానిచ్చిందని కొనియాడారు. ప్రతి సీజన్లో పెట్టుబడి సాయం అందుకుని రైతులు దర్జాగా సాగుకు కదులుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమ అయ్యాయని రైతులు సంబరాలు చేసుకుంటూ రైతు కుటుంబాలు రైతు బంధు వేడుకలు చేసుకుంటున్నాయని కొనియాడారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. సుమారు 250 మంది రైతులకు 50 వేల లోపు రుణాలు మాఫీ అయ్యాయని తెలిపారు. సహకార సంఘ కార్యాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకట రెడ్డి, రైతు బందు సమన్వయ సంఘం అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ సత్యం, కరకగూడెం ఎంపీపీ రేగా కాళీక, పలువురు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: