CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ చంద్రయ్యకు తలపాగా పెట్టి జ్ఞాపిక ను అందించి సన్మానం చేసిన మణుగూరు టిబిజికేయస్ నాయకులు..

Share it:

   


                       


మన్యం టీవీ మణుగూరు:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా బాయి కూనవరం కు చెందిన కళాకారుడు రామ చంద్రయ్య దంపతులను మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు,టిబిజికేయస్ నాయకులు శుక్రవారం వారి స్వగృహం కు వెళ్లి స్వయంగా కలసి పుష్పగుచ్చం,మిఠాయిలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయనకు తలపాగా పెట్టి, దంపతులకు పూల మాలవేసి, జ్ఞాపిక ను అందించి శాలువాల తో ఘనంగా సన్మానించారు. కోల్ బెల్ట్ మణుగూరు ఏరియా కీర్తిని మారుమూల గ్రామంలో ఉండి దేశ స్థాయిలో చాటి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన, కళాకారుడు రామచంద్రయ్య కళలు స్పూర్తిదాయకమని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేంద్ర డిప్యూటి జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవూఫ్,బ్రాంచి నాయకులు వీర భద్రయ్య,కోట శ్రీనివాసరావు, కాపా శివాజీ,మునిగెల రమేష్ సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి,బుర్ర వెంకటేశ్వర్లు,అశోక్,కేపీయూజీ ఫిట్ సెక్రటరీ నాగేల్లి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీల సంఘము ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,ప్రజా ప్రతినిధులు శంకర్,కిట్టు, నాయకులు హాబీబ్,అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: