గుండాల జనవరి 28 (మన్యం మనుగడ) బొలెరో వాహనం పల్టీ పడి పలువురికి గాయాలు అయిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. చెట్టు పల్లి గ్రామం నుండి గుంజేడు వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలు కావడంతో తీవ్ర గాయాలపాలైన వారిని ఖమ్మం నగరంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలపాలైన వారిని గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు
Post A Comment: