మన్యం వెబ్ డెస్క్:
బుధవారం రాత్రి గాలి దుమారం వడగళ్ల తో కూడినటువంటి భారీ వర్షం పడటంతో కొమరారం పోలారం మాణిక్యరం,సర్వే తండా, పోచారం తదితర గ్రామపంచాయతీలో రైతులు మొక్కజొన్న, మిర్చి, పత్తి ,కాకర బీర, టమాట, తదితర పంటలను తీవ్రంగా నష్టపోయారని ఆ రైతుల్ని ఆదుకునే ఎటువంటి చర్యలు చేపట్టకపోతే రైతులు రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందని కనుక వాణిజ్య పంటలకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఇతర పంటలకు ఎకరానికి 50 వేల రూపాయలు చొప్పున చెల్లించి వెంటనే అందజేయాలని, తడిసిన పంటలను కూడా వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ అన్నారు బుధవారం నాడు స్థానిక ఇల్లందు తాసిల్దార్ కి మెమోరాండం సమర్పించారు.
. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పంటలు వేసి పంట చేతికొచ్చే తరుణంలో అకాల వర్షం తీవ్ర ,గాలిదుమారం,వర్శం పడటం వల్ల తీవ్రంగాపంటలు దెబ్బతిన్నాయని, ఈ విధంగా కూరగాయల పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు వెంటనే సర్వేలు నిర్వహించి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని లేకపోతే అఖిలభారత రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయిని రాజు, ఈసం భద్రయ్య, అజ్మీర్ బిచ్చా, తులుశ ,ధర్మాన్న దేవా, సావిత్రి, బుర్ర వెంకన్న, గుర్రం యాదగిరి కోటేష్ మాజీ సర్పంచ్ భీమ్ జి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: