మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 13 ;- ఉడత నేని పుల్లారావు.( పిచ్చయ్య) 8 వ వర్ధంతిని ముష్టిబండలో ఘనంగా నిర్వహించినారు
ఈ సందర్భంగా యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ పిచ్చయ్య గారు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించాలని ఒక కమ్యూనిస్టు గా పుట్టి మరణిస్తే వారి ఆశయాలను వారి జ్ఞాపకాలను స్మరించుకునే ఒక కమ్యూనిస్టు అని ఆయన బ్రతికి ఉన్నప్పుడు నిరంతరం ప్రజా సమస్యల మీద వ్యవసాయ కార్మికులు బాగోగుల గురించి ఆలోచన చేసే వారని వారితో పనిచేసిన అనుభవాలను మరువలేనివాని రాబోయే కాలం కమ్యూనిస్టు లేనని ఈ సందర్భంగా తెలిపినారు ఈ కార్యక్రమంలో లో సిపిఐ మండల కార్యదర్శి తంగేళ్లమూడి శివకృష్ణ సిపిఐ జిల్లా నాయకులు పండూరు వీరబాబు మహిళా సంఘం జిల్లా నాయకురాలు యండమూరి రత్నకుమారి టిఆర్ఎస్ నాయకులు కూకల కుంట రవి ఉడతనేని రవి తోట వెంకటేశ్వరరావు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు బత్తుల సాయి ఏ ఐ వై ఎఫ్ జిల్లా నాయకులు ధర్మ నల్ల ప్రసాదు మొదలగువారు పాల్గొన్నారు.
Post A Comment: