మన్యం మనుగడ ఏటూరునాగారం
మండల కేంద్రము లోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు.ఉదయం 5. 25 నిమిషాలకు ఉత్తర ద్వారదర్శనం కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ సప్పిడి రాము, ఆలయ ప్రధాన అర్చకులు యల్లా ప్రగడ నాగేశ్వరావుశర్మ వేద మంత్రాలతో ప్రారంభించారు.భక్తులు ఉత్తర ద్వారం వద్ద స్వామి వారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం లో అర్చకుడు ముక్కాముల వెంకటనారాయణ శర్మ, రాధాకృష్ణ శర్మ.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి,ఇర్సవడ్ల వెంకన్న,పెండ్యాల సంతోష్, అలువాల శ్రీనివాస్,బాల్య ప్రసాద్,వావిలాల ఎల్లయ్య, పల్లా పవణ్,చందు,శ్రావణ్, చిత్తుబొత్తుల సదానందం, బాలాజీ బ్రహ్మం,శశి,సంతోష్, అలువాల కిరణ్ కుమార్, బూర సునీల్,బూర సురేష్, పొగుల లక్ష్మీనారా యణ,సిసింద్రి,అందె రాజేష్ ,కొండాయి చిన్ని,శివ, ఎగ్గడి వెంకటేశ్వర్లు,సంతోష్ పాల్గొన్నారు.
Post A Comment: