మన్యం టీవి, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని 73 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల సంవత్సరాల బానిసత్వం నుండి సత్యం అహింస మార్గాలద్వారా తనదైన రీతిలో భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణమైన మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని భారత రాజ్యాంగ అమలు చేసుకున్న ఈ గణతంత్రం రోజున ఆవిష్కరించడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం పరిచారు. అనంతరం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండా ఎగరవేసి చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల జెడ్పీటీసీ చిన్నంసెట్టీ వరలక్ష్మి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్, తెరాస పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, మండల నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: