CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.

Share it:

 



 మన్యం టీవి, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని 73 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల సంవత్సరాల బానిసత్వం నుండి సత్యం అహింస మార్గాలద్వారా తనదైన రీతిలో భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణమైన మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని భారత రాజ్యాంగ అమలు చేసుకున్న ఈ గణతంత్రం రోజున ఆవిష్కరించడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం పరిచారు. అనంతరం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండా ఎగరవేసి చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల జెడ్పీటీసీ చిన్నంసెట్టీ వరలక్ష్మి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్, తెరాస పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, మండల నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: