CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీలపై దాడులు అమానుషం.సాకివాగు ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి.టి.డి.పి.

Share it:


 

ములకలపల్లి:మన్యం మనుగడ (న్యూస్):అదివాసీలపై దాడులు అమానుషం అని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని టీడీపీ అశ్వారావుపేట ఇంచార్జి కట్టం స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాకివాగు గ్రామాన్ని టీడీపీ బృందం సందర్శించి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సమాజానికి దూరంగం అడవిలో జీవనం సాగిస్తున్న అమాయకపు ఆదివాసీ మహిళలపై అటవీ శాఖ అధికారి మహేష్ దాడి, మైనర్ బాలికలపై అత్యాచార యత్నం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని,ఈ ఘటనపై ఇప్పటివివరకు బాధితుల ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పోలీసులు విచారణ జరగపోవడం హేయమైనదని,గిరిజన శాఖ మంత్రి ఘటన పై స్పందించినప్పటికి క్రింది స్థాయి అధికారులు ఎవ్వరూ ఈ ఘటనపై స్పందించి కేసు నమోదు, వైద్య సదుపాయం, బాధితులకు అండదండలు అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ ఘటనకు బాద్యులపై చర్య తీసుకునేవరకు తమ పార్టీ గిరిజనులకు అండగా ఉంటుందని తెలిపారు.కార్యక్రమంలో ఆ పార్టీ అశ్వారావుపేట మండల అధ్యక్షులు నార్ల పాటి శ్రీను, ములకలపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చల్ల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు సున్నం సునీత, తాటి తులసి, మండల పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు చిన్న పుల్లయ్య, తాటి పోతురాజు, సోయం రామ్మూర్తి, ఎన్డి పార్టీ ఎంపిటిసి విజయ, శేషు,కరీం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: