మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ డైరీ ని స్థానిక సీఐ బంధం ఉపేంద్ర రావు చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి టిఆర్ఎస్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, జారే ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకురాలు వగ్గెల పూజ, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరీ ఆవిష్కరణ సభలో వక్తలు మాట్లాడుతూ మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వాలకు వారధని, అటువంటి మీడియా లో ఉన్న మీడియా మిత్రులందరూ ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తూ సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని, వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు తోకలు హరీష్ గుప్త, కురిశెట్టి నాగబాబు, కోశాధికారి బండి సురేష్ మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: