మన్యంటీవి, అశ్వారావుపేట:విందులొద్దు, చిందులొద్దు, డీజే డ్యాన్సులొద్దు, నిండైన జీవితం కోసం పోరాడుదాము, విదేశీ విష సంస్కృతిని విడనాడుదామంటూ ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్త కావడిగుండ్ల గ్రామంలో కంగాల వెంకటేష్ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి మండల కార్యదర్శి కంగాల కల్లయ్య మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల పేరుతో దేశ యువతలో విషబీజాలు నాటుతున్నారని, పాశ్చాత్య సంస్కృతి వల్ల మనదేశంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయని, ప్రజలను, యువకులను మద్యంకు బానిసలను చేస్తూ, పాలకులు వారి పబ్బం గడుపుకుంటున్నారని, ఇటువంటి వాటికి వ్యతిరేకంగా యువత పోరాట స్ఫూర్తితో ముందుకు రావాలని, విష సంస్కృతికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం సర్పంచ్ గొంది లక్ష్మణరావు, కావడిగుండ్ల సర్పంచ్ కంగాల భూలక్ష్మి ప్రగతిశీల యువజన సంఘం మండల అధ్యక్షుడు బాడిస లక్ష్మణరావు, అఖిలభారత రైతుకూలి సంఘం మండల నాయకులు కణితి జోగారావు, మహిళా సంఘం నాయకులు కొమరం లక్ష్మి, కణితి వెంకటేష్, వాసం పోతురాజు, కనితి గోపాలరావు, కొమరం మంగరాజు, జెడ్డి బుచ్చయ్య,కొమరం భీమరాజు,పూనెం ముత్యాలు,వాసం దుర్గ, కొమరం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: