మన్యం మనుగడ మంగపేట.
తెలంగాణా మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాం బాబు జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెపుతూ యువత ను జాగ్రత్తగా ఉండాలని, విందు వినోదాలకు, వేడుకలకు ఇది సమయం కాదని కరోనా మహమ్మారి ని తరిమి కొట్టాలంటే మనం అందరం కొంత సంయమనం పాటించాలని కోరారు.
కొత్త సంవత్సరం లో అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరు కరోనా విషయం లో అశ్రద్ధ చేయకండి, మనం చేసే అశ్రద్ధ అజాగ్రత వలన మనం పెద్ద అపాయం లో ఇరుక్కుంటాం అందుకే మనం తీసుకొనే జాగ్రత్త లే మనకు శ్రీరామ రక్ష.ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు అనుసరించి ప్రతి ఒక్కరు మాస్క్,శానిటైజర్, భౌతిక దూరం పాటిస్తూ జీవించడం తప్ప మనకు వేరొక ప్రత్యామ్నాయం లేదు.కొరోనా ముప్పు తో పాటు మరొక ఉపద్రవం ఓమిక్రాన్ రూపంలో పొంచి ఉంది అందుకే ప్రతి ఒక్కరూ అవసరం అయితే తప్ప బయటకు రావొద్దు విలసాలకు,విందులకు, వినోదాలకు పోయి ప్రాణాలకు ముప్పు తీసుకరావద్దు కరోనా నియమాలను పాటిద్దాం ఆరోగ్యం గా జీవిద్దాం భావి భారతానికి ఆదర్శం అవుదాం.
Post A Comment: