మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, డిసెంబర్ 31, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని కొమ్ముగూడెం గ్రామంలో వెలసియున్న పెద్దమ్మ తల్లి ఆలయం నందు శుక్రవారం అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం భక్తజన సమూహంతో అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాంతిరామ్ గురుస్వామి ఆధ్వర్యంలో 50 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టి కేరళలోని శబరిమలకు బయలుదేరనున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, జడ్పీటీసీ కళావతి, సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: