గుండాల/ఆళ్ళపల్లి జనవరి 31 (మన్యం మనుగడ)
ఆళ్ళపల్లి మండల కేంద్రము హైస్కూల్ సమీపం ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కమిటీని ఎన్నుకున్నట్లు ఆ కమిటీ ఇంఛార్జి జలాల్ మొహమ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. తాసిల్దార్ రజియా సుల్తానా కు వినతి పత్రం అందజేశా మనీ అన్నారు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కమిటీ గౌరవ అధ్యక్షుడిగా మొహమ్మద్ ఖయ్యుం, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కండె వెంకన్న, వాసం శ్రీకాంత్, కార్యదర్శి పరమ ప్రభాకర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కండె మహేష్, కోశాధికారులు మహమ్మద్ ఫయీమ్, బోడకుంట బిక్షం, కీసర కిరణ్, ఉపాధ్యక్షులు కండె నారాయణ, కె.నరేష్, ఎస్.పరమేష్, జి.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు బి.శ్రీకాంత్, ఎన్.నవీన్, బి.బాబురావు, ఎం.మధులత, ఆర్.రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, వీరితో పాటు 31 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. మండల కేంద్రములో మహనీయుల విగ్రహాల ఏర్పాటులో భాగంగా తొలుత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో ప్రారంభించి, దశలవారీగా తెలంగాణ తల్లి విగ్రహం, గిరిజనుల అభివృద్ధికై పోరాడిన వీరుడు కొమురం భీం విగ్రహం అలాగే గ్రంథాలయము, ప్రెస్ క్లబ్ లను ఏర్పాటు చేసి మండలానికి తలమానికంగా నిలిచేలా కృషి చేస్తామని చెప్పారు
Post A Comment: