మన్యంటీవి, అశ్వారావుపేట: గత పది సంవత్సరాలు పైగా, వార్తల సేకరణలో ఇటు పత్రికా పరంగానూ, డిఎన్బిటీవీ న్యూస్ ద్వారా ప్రజల ఆశీస్సులు పొందుతూ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న డిఎన్బి పత్రిక మరియు టీవీ ఛానల్ నూతన సంవత్సర 2022క్యాలెండర్ ను స్థానిక అశ్వరావుపేట మండల తాహాసిల్దార్ కార్యాలయంలో తాహాసిల్దార్ చల్లా ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎన్బి న్యూస్ మరియు ఛానల్, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ పెనుగొండ సత్యనారాయణ, అశ్వరావుపేట ఆర్సి సోమేశ్, రిపోర్టర్ కేసు పాక నరసింహారావు, స్థానిక అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ సభ్యులు కనకారావు, నయుం, నాగేశ్వరరావు, ఫ్రాన్సిస్, ఆకుల రవి, రంజిత్ సింగ్, చిన్న రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: