మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో రామానుజవరం గ్రామం లోని ఆదరణ వృద్ధాశ్రమానికి టాయిలెట్స్ నిర్మాణానికి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేస్తామని విప్ రేగా కాంతారావు హామీ ఇచ్చారు.ఈ మేరకు శనివారం రూ.20,000 వేల రూపాయలను డాక్టర్.వై. మాలాకీ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా.కాంతారావు చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,టిఆర్ఎస్ నాయకులు వట్టం.రాంబాబు, యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,నాయకులు ఆవుల. నర్సింహారావు,లక్ష్మయ్య,తాత రమణ,రామకోటి,యువజన, నాయకులు పద్ధం.శ్రీనివాస్, గుర్రం.సృజన్,సోషల్ మీడియా సభ్యులు సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: