మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని మదీనా కాంప్లెక్స్ లో సోమవారం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు చింతా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్,జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య హాజరై మాట్లాడుతూ.శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో 12 ఆదివాసి డిమాండ్లపై ప్రభుత్వానికి, అధికారులకు,ప్రజాప్రతి నిధులకు వినతి పత్రాలు అందజేయాలని తీర్మా నించారు.ఫిబ్రవరి 2 ,3 ,4 తేదీలలో ఆదివాసి తెగల జాతీయస్థాయి సమ్మేళన దినోత్సవాలు జరుపుకోవాలని ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ సమావేశంలో జాతీయ కో కన్వీనర్లు రత్నం,రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి రాజబాబు,జిల్లా ఉపాధ్యక్షులు వట్టం జనార్ధన్,మహిళా నాయకులు పడిగ పార్వతి,జిల్లా అధ్యక్షులు తైన వేణి సరోజన,దబ్బగట్ల శాంత,ఏఎస్ యు నాయకులు జవాజి రవి,జిల్లా నాయకులు పెండకట్ల బాలరాజు,కబ్బాక రామన్న,వాసం శ్రావణ్,వట్టం సురేష్,చింత శ్రావణ్ కుమార్,దబ్బ గట్ల నాగభూషణం,కోడె రవి,జజారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: