మన్యం మనుగడ, పినపాక:
ఓమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, భారత ప్రభుత్వ సూచనల మేరకు రేపటి నుండి 15 నుండి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు, విద్యార్థిని, విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పినపాక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు నిర్వహించబడును. ఇట్టి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పినపాక మండల ప్రజా ప్రతినిధుల, అధికారుల ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది అని ఎంపీపీ గుమ్మడి గాంధీ ఒక ప్రకటనలో తెలియజేశారు.
మొదటి డోస్ టీకా తీసుకోని 18 ఏళ్లు పైబడిన వారు కూడా రేపటినుండి టీకా తీసుకోవాలని కోరడమైనది. రేపటి నుండి టీకా తీసుకునేందుకు వచ్చే వారు తప్పనిసరిగా తమ వెంట ఆధార్ ఐడి కార్డ్, మరియు మొబైల్ తెచ్చుకోగలరని సూచించడమైనది.
Post A Comment: