మన్యం మనుగడ, మణుగూరు:
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గత 14 సంవత్సరాలుగా మిత్రుని జ్ఞాపకార్ధంగా బూర్గంపహాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొని టోర్నమెంట్ ని ప్రారంభించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత,ITC-PSPD HRGM శ్యాం కిరణ్.
అనంతరం జడ్పీటీసీ శ్రీలత మాట్లాడుతూ 14 సంవత్సరాల క్రితం యూసఫ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతని జ్ఞాపకార్థంగా బూర్గంపహాడ్ యువత ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని వారి మిత్రులను కొనియాడారు.తమ చిన్ననాటి స్నేహితున్ని మర్చిపోకుండా కలకాలం గుర్తుంచుకునేందుకు అతని పేరుతో ప్రతియేటా ఈ క్రికెట్ టోర్న
మెంట్ నిర్వహించడం చాల సంతోషకరమైన విషయమని వారి మిత్ర బంధాన్ని అభినందించారు.అలాగే క్రిడలు అనేవి యువతలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచ నలుమూలలు చాటిచెప్పడానికి దోహదపడతాయని తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు(విన్నర్స్ క్యాష్ ప్రైజ్ దాత),ITC అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చంగల్ రావు,బూర్గంపహాడ్ మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు గోనెల నాని,స్వేరోస్ జిల్లా నాయకులు గొర్ల వీరబాబు(రన్నర్స్ క్యాష్ ప్రైజ్ దాత),స్థానిక మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు,బిజ్జం వెంకట్రామిరెడ్డి,షబీర్ పాషా,ముత్యాల కిషోర్,SI ఖాజా నసిరుద్దీన్,సలహాదారులు సోహెల్ పాషా,గోనెల సర్వేశ్వరరావు,భజన సతీష్,సొసైటీ డైరెక్టర్ బొల్లి రవి,యూసఫ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు భజన ప్రసాద్,అబ్దుల్ సలీమ్,కన్నెబొయిన సారధి,మందా ప్రసాద్,బబ్బు రాయుడు,కాలేజి ప్రిన్సిపాల్,క్రిడాకారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: