మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన కుటుంబాలను తోగ్గూడెం ఎంపీటీసీ చింతపండు సత్యం , స్థానిక టిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా అనారోగ్యం బారిన పడిన దాసరి రమణ అనే మహిళకు వైద్య ఖర్చులకు గాను రెండు వేల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే అదే కాలనీకి చెందిన అలవాల దేవమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతు సమన్వయ సమితి మండల కమిటీ సభ్యులు గొట్టిముక్కుల స్వతంత్ర రెడ్డి, పినపాకపంచాయతీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ వెంకటేశ్వర్లు, పినపాక సొసైటీ డైరెక్ట్ గునగంటి సమ్మయ్య గౌడ్, టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల ఆధ్యక్షులు సోంపల్లి తిరుపతి,టీఆరెస్ నాయకులు సయ్యద్ ఇమామ్, గంట ఎర్రయ్య,కొంపెల్లి నాగేశ్వరరావు,కొత్త దామోదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: