- అంతిమయాత్రలో పాల్గొన్న సిపిఎం నాయకుల
- సిపిఎం జిల్లా కార్యదర్శి
- తుమ్మల వెంకటరెడ్డి.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరునాగారంమండలం చల్పక గ్రామానికి చెందిన సోనప హనుమయ్య సోమ వారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తాను పండించిన మిర్చి తోటకు వైరస్ సోకి దెబ్బతింటే మందు కొడదామని పురుగు మందు తెచ్చుకొని పొలానికి కొట్టకుండా అతనే తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమయ్య కు ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు ఉన్నాడు బిడ్డ పెండ్లి కుదిరి ఎంగేజ్మెంట్ కూడా అయింది ది ఇటు మిర్చి పంట వైరస్ బారిన పడి దెబ్బతిని తెచ్చిన అప్పులు ఎక్కువయ్యి అటు బిడ్డ పెండ్లి ఎలా చేయాలి అన్న దిగులుతో చనిపోయాడని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి పేర్కొన్నారు.ఈ రోజు చల్పక గ్రామంలో హనుమయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ప్రభుత్వం జిల్లాలో వైరస్ సోకిన దెబ్బతిన్న మిర్చి తోటలో వ్యవసాయ శాఖ వారితో వెంటనే సర్వే చేసి రైతులకు నష్టపరిహారం ఎకరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని లేనియెడల మరికొంత మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి జిల్లాలో ఉన్నదని పేర్కొన్నారు.వెంటనే ప్రభుత్వం హనుమయ్య కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎండి దావూద్ సర్పంచ్ చింత రమేష్,సిపిఎం నాయకులు బొగం కొమురయ్య,తాటి నరసింహులు,చింత సమ్మయ్య,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: