మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, గాయత్రి మాత ఆలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి పీఠం ని దర్శించుకుని,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విప్ రేగా కు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ, అర్చకులు విప్ రేగా ను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎస్ కె టీ గ్రూప్స్ చైర్మన్ దోసపాటి. వెంకటేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొలిశెట్టి నవీన్, నాయకులు డాక్టర్ సమ్మయ్య, రాంబాబు,కృష్ణ,అర్చకులు వసంత చారి,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: