మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, డిసెంబర్ 13, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామానికి చెందిన నాగ పెద్దిరాజు అతని భార్య ఆదివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ఒక శుభకార్యానికి వెళుతుండగా కాకర్ల వైపునుండి నర్సాపురం వైపు జామాయిల్ కర్ర లోడుతో వస్తున్న TS 28 T 6567 ట్రక్కు నెంబరు గల ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో నాగ పెద్దిరాజు తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో సంఘటనా స్థలంలో పడిపోగా హుటాహుటిన కొత్తగూడెం వైద్యశాలకు తరలించగా, వైద్యుల సూచన మేరకు ఖమ్మం హాస్పటల్ కు తరలించామని, పరిస్థితి విషమంగా ఉంది హైదరాబాద్ తీసుకెళ్ళమని అక్కడి వైద్యులు సూచించడంతో హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలిపారు. ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్ హెడ్ లైట్స్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోయారు.
Post A Comment: