మన్యం టివి దుమ్మగూడెం:
దుమ్ముగూడెం సీఐ నల్లగట్ల వెంకటేశ్వర రావు ఈరోజు నూతన సంవత్సరం సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారుమద్యం త్రాగి రోడ్డు మీద వాహనాలు నడుపరాదు. సైలెన్సర్ సౌండ్ లతో ఇతరులకు ఇబ్బంది కలుగచేయకూడదు. వారి వాహనాలను సీజ్ చేసి చట్టపరమై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అతివేగముగా వాహనాలు నడిపేవారిని ప్రత్యేకంగా గుర్తించి చట్టపరమై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ముఖ్యంగా మైనర్లు వాహనాలతో పట్టుబడితే, వారి తల్లిదండ్రులపై కూడ చట్టపరమై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
కావున ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరు వారి ఇళ్లలోనే జరుపుకొని పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాము. వాహనాలను వేగముగా నడిపి నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండవలసిన సమయంలో రోడ్డు ప్రమాదాల బారినపడి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని దుమ్ముగూడెం మండల ప్రజలు ముఖ్యముగా యువకులు పోలీసువారికి సహకరించాలని కోరుచున్నాము.
Post A Comment: