గుండాల /ఆళ్లపల్లి డిసెంబర్ 30(మన్యం మనుగడ) గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు ఇంటింటికి కెసిఆర్ గ్రామ గ్రామానికి టిఆర్ఎస్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, సొసైటీ చైర్మన్ గోగ్గల రామయ్య అన్నారు. గురువారం మండలం పరిధిలోని దొంగ తో గు గ్రామంలో వారు పర్యటించారు అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం అక్షర సమితి సంస్థ అందిస్తున్న దుప్పట్లను గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంగమ్మ అక్షర సమితి అధ్యక్షులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: